1 అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపొబడెను.
2 నలువది దినములు దివారాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
3 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి - నీవు దేవుని కూమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను.
4 అందుకాయన - మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించునుఅని వ్రాయబడియున్నదనెను. 2
5 అంతట అపవాదిపరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయశిఖరమున ఆయనను నిలువబెట్టి
6 - నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము - ఆయన నిన్నుగూర్చి తన దూతలకాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండ వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అని వ్రాయబడియున్నదనిఆయనతో చెప్పెను.
7 అందుకు యేసు -ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరియొకచోటవ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
8 పిమ్మట అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోకరాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి
9 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల ఇవన్నియు నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా
10 యేసు వానితో - సాతానా, పొమ్ము - నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపవలెను. అని వ్రాయబడియున్నదనెను. 5
11 అంతట అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యచేసిరి.
12 యోహాను చెరలో ఉంచబడెనని యేసు విని గలిలైయకు తిరిగి వెళ్లి
13-16. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలిదేశమును యొర్దాను కావలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలైయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్నవారికి వెలుగు ఉదయించెనుఅని ప్రవక్తయైన యెషయాద్వారాపలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. )
17 అప్పటినుండి యేసు - పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడనిచెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.
18 యేసు గలిలైయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
19-20. ఆయన - నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
21 ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను.
22 వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
23 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలైయయందంతట సంచెరించెను.
24 ఆయన కీర్తి సురియదేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువుగలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
25 గలిలైయ దెకపొలి యెరూషలేము యూదైయయను ప్రదేశములనుండియు యొర్దానుకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.
Download Audio File
2 నలువది దినములు దివారాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
3 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి - నీవు దేవుని కూమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను.
4 అందుకాయన - మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించునుఅని వ్రాయబడియున్నదనెను. 2
5 అంతట అపవాదిపరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయశిఖరమున ఆయనను నిలువబెట్టి
6 - నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము - ఆయన నిన్నుగూర్చి తన దూతలకాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండ వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అని వ్రాయబడియున్నదనిఆయనతో చెప్పెను.
7 అందుకు యేసు -ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరియొకచోటవ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
8 పిమ్మట అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోకరాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి
9 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల ఇవన్నియు నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా
10 యేసు వానితో - సాతానా, పొమ్ము - నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపవలెను. అని వ్రాయబడియున్నదనెను. 5
11 అంతట అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యచేసిరి.
12 యోహాను చెరలో ఉంచబడెనని యేసు విని గలిలైయకు తిరిగి వెళ్లి
13-16. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలిదేశమును యొర్దాను కావలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలైయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్నవారికి వెలుగు ఉదయించెనుఅని ప్రవక్తయైన యెషయాద్వారాపలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. )
17 అప్పటినుండి యేసు - పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడనిచెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.
18 యేసు గలిలైయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
19-20. ఆయన - నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
21 ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసికొనుచుండగా చూచి వారిని పిలిచెను.
22 వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
23 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలైయయందంతట సంచెరించెను.
24 ఆయన కీర్తి సురియదేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువుగలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
25 గలిలైయ దెకపొలి యెరూషలేము యూదైయయను ప్రదేశములనుండియు యొర్దానుకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.
Download Audio File
No comments:
Post a Comment